Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:07 AM

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత
02-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.


CSR నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హాస్పిటల్ నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.


ఇంకా రూ.50 లక్షల నిధులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, హాస్పిటల్‌ను 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.


SRR చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రోగులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు RO ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ESI హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు చెప్పారు.


ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.


ఈ సందర్భంగా మంత్రి సవిత HDSతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Sthanikam

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత

Article Image

పెనుకొండ: రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.


CSR నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హాస్పిటల్ నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.


ఇంకా రూ.50 లక్షల నిధులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, హాస్పిటల్‌ను 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.


SRR చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రోగులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు RO ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ESI హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు చెప్పారు.


ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.


ఈ సందర్భంగా మంత్రి సవిత HDSతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News