రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత
రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ: రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
CSR నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హాస్పిటల్ నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇంకా రూ.50 లక్షల నిధులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, హాస్పిటల్ను 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
SRR చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రోగులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు RO ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ESI హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు చెప్పారు.
ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత HDSతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి