Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:42 AM

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు
May 01, 2026 12:41 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.


రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.


వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News