PRINT TIME: May 01, 2026 02:31 PM
రొద్దం అంబేద్కర్ సర్కిల్లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు
రొద్దం అంబేద్కర్ సర్కిల్లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు
May 01, 2026 12:41 PM
10 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి