రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రపాలనగరం మజీద్లో ముస్లిం సోదరులకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర సౌహార్దం, సహనం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి