Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:58 PM

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
28-04-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు రేపు ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఈ మేరకు ప్రకటిస్తూ ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తిచేసిన అధికారులు, అనంతరం మార్కుల నమోదు, ధృవీకరణ, సాంకేతిక ప్రక్రియలను ముగించి ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రస్థానానికి కీలకమైన ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Sthanikam

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు

Article Image

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు రేపు ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఈ మేరకు ప్రకటిస్తూ ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తిచేసిన అధికారులు, అనంతరం మార్కుల నమోదు, ధృవీకరణ, సాంకేతిక ప్రక్రియలను ముగించి ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రస్థానానికి కీలకమైన ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News