రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు
Krishna
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు రేపు ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఈ మేరకు ప్రకటిస్తూ ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తిచేసిన అధికారులు, అనంతరం మార్కుల నమోదు, ధృవీకరణ, సాంకేతిక ప్రక్రియలను ముగించి ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కులు, గ్రేడ్లు తెలుసుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రస్థానానికి కీలకమైన ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి