Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 08:03 PM

రామన్నపేట మండల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.

రామన్నపేట మండల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.

రామన్నపేట మండల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.
April 28, 2026 05:33 PM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తహసిల్దార్ లాల్ బహదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలు తీవ్రంగా పేరుకుపోయాయని, అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎండాకాలం తీవ్రతతో బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య ఉద్ధృతమైందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పారిశుద్ధ్యానికి నిధుల కొరతతో గ్రామాలు అస్వచ్ఛంగా మారుతున్నాయని, ఉపాధి హామీ పనుల్లో ఫోటో హాజరు సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాకపోవడం ఆందోళనకరమన్నారు.

రామన్నపేట–అమ్మనబోలు, కక్కిరేణి ప్రధాన రహదారులు గుంతలతో దెబ్బతిని ప్రయాణాలు దుర్భరంగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారని, రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, మునికుంట్ల లెనిన్, మేడి ముకుంద, శానగొండ రామచంద్రం, పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News