రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.
1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.
“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి