రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం
రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం
Reporter Sangameshwar Reddy
గో సంరక్షణ, గో సేవకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ఉద్యమ ప్రతినిధుల డిమాండ్
న్యాల్కల్, స్థానిక ప్రతినిధి:
గో సేవా–గో రక్షణ ఉద్యమ ప్రతినిధులు న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం సమర్పించారు. దేశీయ గో వంశ పరిరక్షణ, గో హత్య నివారణ, గో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా గో సంరక్షణకు చట్టబద్ధ రక్షణ అవసరమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. గో హత్య పూర్తిస్థాయిలో నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, గో సేవకు ప్రత్యేక శాఖ, గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశీయ గోవుల సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం, గో ఆధారిత జీవన విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభు వినతిపత్రాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ ప్రబంధ్ అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ పవర్, దేవాలయ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, యువ నాయకులు కమ్మరి రాజు, గార్లపల్లి సాయికుమార్, గొల్ల శ్రీశైలం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి