Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 06:33 PM

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

 రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం
April 28, 2026 04:15 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గో సంరక్షణ, గో సేవకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ఉద్యమ ప్రతినిధుల డిమాండ్


న్యాల్కల్, స్థానిక ప్రతినిధి:

గో సేవా–గో రక్షణ ఉద్యమ ప్రతినిధులు న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం సమర్పించారు. దేశీయ గో వంశ పరిరక్షణ, గో హత్య నివారణ, గో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా గో సంరక్షణకు చట్టబద్ధ రక్షణ అవసరమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. గో హత్య పూర్తిస్థాయిలో నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, గో సేవకు ప్రత్యేక శాఖ, గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశీయ గోవుల సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం, గో ఆధారిత జీవన విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభు వినతిపత్రాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ ప్రబంధ్ అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ పవర్, దేవాలయ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, యువ నాయకులు కమ్మరి రాజు, గార్లపల్లి సాయికుమార్, గొల్ల శ్రీశైలం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News