Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

 రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం
28-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గో సంరక్షణ, గో సేవకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ఉద్యమ ప్రతినిధుల డిమాండ్


న్యాల్కల్, స్థానిక ప్రతినిధి:

గో సేవా–గో రక్షణ ఉద్యమ ప్రతినిధులు న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం సమర్పించారు. దేశీయ గో వంశ పరిరక్షణ, గో హత్య నివారణ, గో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా గో సంరక్షణకు చట్టబద్ధ రక్షణ అవసరమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. గో హత్య పూర్తిస్థాయిలో నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, గో సేవకు ప్రత్యేక శాఖ, గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశీయ గోవుల సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం, గో ఆధారిత జీవన విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభు వినతిపత్రాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ ప్రబంధ్ అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ పవర్, దేవాలయ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, యువ నాయకులు కమ్మరి రాజు, గార్లపల్లి సాయికుమార్, గొల్ల శ్రీశైలం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

Article Image

గో సంరక్షణ, గో సేవకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ఉద్యమ ప్రతినిధుల డిమాండ్


న్యాల్కల్, స్థానిక ప్రతినిధి:

గో సేవా–గో రక్షణ ఉద్యమ ప్రతినిధులు న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం సమర్పించారు. దేశీయ గో వంశ పరిరక్షణ, గో హత్య నివారణ, గో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా గో సంరక్షణకు చట్టబద్ధ రక్షణ అవసరమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. గో హత్య పూర్తిస్థాయిలో నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, గో సేవకు ప్రత్యేక శాఖ, గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశీయ గోవుల సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం, గో ఆధారిత జీవన విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభు వినతిపత్రాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ ప్రబంధ్ అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ పవర్, దేవాలయ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, యువ నాయకులు కమ్మరి రాజు, గార్లపల్లి సాయికుమార్, గొల్ల శ్రీశైలం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News