Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:46 AM

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి  – వీసీ జానయ్య
May 04, 2026 11:16 AM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధ్యమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జానయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు నేరుగా రైతుల ముంగిట్లోకే వస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 55 గ్రామాల్లో సుమారు 50 వేల మంది రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల లోపం, నకిలీ విత్తనాలు ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. రసాయనిక క్రిమిసంహారక మందుల అధిక వాడకం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి పాటిస్తే భూసారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంజిరెడ్డి, డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News