Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:15 AM

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి  – వీసీ జానయ్య
04-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధ్యమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జానయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు నేరుగా రైతుల ముంగిట్లోకే వస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 55 గ్రామాల్లో సుమారు 50 వేల మంది రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల లోపం, నకిలీ విత్తనాలు ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. రసాయనిక క్రిమిసంహారక మందుల అధిక వాడకం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి పాటిస్తే భూసారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంజిరెడ్డి, డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

Article Image

నల్గొండ,

రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధ్యమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జానయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు నేరుగా రైతుల ముంగిట్లోకే వస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 55 గ్రామాల్లో సుమారు 50 వేల మంది రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల లోపం, నకిలీ విత్తనాలు ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. రసాయనిక క్రిమిసంహారక మందుల అధిక వాడకం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి పాటిస్తే భూసారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంజిరెడ్డి, డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News