Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఎమ్మెల్యే వేముల వీరేశం సహాయం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 01:47 PM

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి  – వీసీ జానయ్య
May 04, 2026 11:16 AM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధ్యమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జానయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు నేరుగా రైతుల ముంగిట్లోకే వస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 55 గ్రామాల్లో సుమారు 50 వేల మంది రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల లోపం, నకిలీ విత్తనాలు ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. రసాయనిక క్రిమిసంహారక మందుల అధిక వాడకం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి పాటిస్తే భూసారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంజిరెడ్డి, డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News