Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 04:40 AM

రైతులతో రాజకీయాలా?.. రేవంత్ సర్కారుపై రామ్ చందర్ రావు ఫైర్

రైతులతో రాజకీయాలా?.. రేవంత్ సర్కారుపై రామ్ చందర్ రావు ఫైర్

రైతులతో రాజకీయాలా?.. రేవంత్ సర్కారుపై రామ్ చందర్ రావు ఫైర్
April 30, 2026 07:58 PM 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ప్రతినిధి:

రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు మండిపడ్డారు.

జిల్లా పరిధిలోని హనుమపురం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ సర్కారు రైతులతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గతంలో రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయాయని గుర్తుచేశారు. సందర్శించిన కేంద్రంలో 20 రోజులుగా కేవలం రెండు లారీలు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ, వందకు పైగా కుప్పలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితికి ఇదే నిదర్శనమని అన్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, గన్ని బ్యాగులు వంటి సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు.

ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News