PRINT TIME: May 04, 2026 05:17 PM
రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
May 04, 2026 02:27 PM
74 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ ర్యాలయం ముందు రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం నెల రోజులుగా కుప్పలుగా పేరుకుపోయి ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.
మిల్లర్లు క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి