రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
EDIGA NAVEENKUMAR
పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.
రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.
ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి