Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:55 AM

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
29-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.

రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్‌లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


Sthanikam

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

Article Image

పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.

రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్‌లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News