Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 01:23 AM

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
April 29, 2026 04:13 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.

రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్‌లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News