Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 05:51 PM

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్
April 29, 2026 04:13 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.

రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్‌లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News