రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
RAPOLU LINGASWAMY
రంగారెడ్డి జిల్లా :వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైతు బజార్ ప్రాంతంలోని హుడా పార్క్ ఎదురుగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, చాక్లెట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతను బిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానం వ్యక్తమవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టినప్పటికీ అతని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి