Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:43 PM

రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
March 12, 2026 05:08 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా :వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైతు బజార్ ప్రాంతంలోని హుడా పార్క్ ఎదురుగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, చాక్లెట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతను బిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానం వ్యక్తమవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టినప్పటికీ అతని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News