Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:12 AM

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత
01-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.


గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Sthanikam

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

Article Image

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.


గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News