రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత
రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.
గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి