రాబందు కాళ్ళకి GPS ట్రాకర్, భయందోళనలో ప్రజలు
రాబందు కాళ్ళకి GPS ట్రాకర్, భయందోళనలో ప్రజలు
Sandeep journalist
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు ప్రత్యక్షమైంది.ఎన్నో సంవత్సరాలుగా అసలు సంచారమే లేని రాబందు జిపిఎస్ ట్రాకర్ తో గ్రామశివారులోని ఓ చెను వద్ద కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.రాబంధువు కాళ్లకు నెంబర్స్ తో కూడిన ట్యాగ్ ఉండటంతో గ్రామస్తులు కొందరు భయాందోళన చెందారు.గ్రామస్థులు పారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి వచ్చిన ఎప్ ఆర్వో వికాస్ రాబందు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో రాబందులు అంతరించిపోయే దశలో ఉన్నాయని,లక్షల్లో ఉన్న రాబందులు అనేక కారణాల వల్ల వేలల్లో మాత్రమే ఉన్నాయని,వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది అని,ప్రజలు అరుదైన జాతి పక్షులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని,గ్రామంలో కనిపించిన రాబందు బహుశా మహారాష్ట్ర నుండి వచ్చి ఉండొచ్చు అని రాబందులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగిన వాటి లొకేషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ సహాయంతో ట్రేస్ చేస్తుందని,రాబందు కు అమర్చిన పరికరాలు వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయడనికి అని ప్రజలు ఎవ్వరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వికాస్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి