సింగూరు ప్రాజెక్టుకు మరమ్మత్తులు
మెదక్, స్థానికం ప్రతినిధి
సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల కారణంగా రబీ 2025–26 సీజన్లో ఘనపూర్ ఆనకట్టు (వనదుర్గ ప్రాజెక్టు) ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు.
వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కుల్చారం, మెదక్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట మండలాల ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రైతులు మరింత సమాచారం కోసం ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఇరిగేషన్ ఈఈ: 7093604017
జిల్లా వ్యవసాయ అధికారి: 8977750785.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి