పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్
పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్
Editor Desk
ఆదోని,: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ తెలిపారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా, కొన్ని పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
ఈ పుకార్ల కారణంగా ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తుండగా, కొందరు దీనిని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నారని విమర్శించారు. దీంతో సాధారణ ప్రజలకు ఇంధనం అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పక్క రాష్ట్రం కర్నాటకలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభిస్తున్నాయని, దీని ద్వారా రాష్ట్రంలో అసలు కొరత లేదని స్పష్టమవుతోందన్నారు. ఇది కొందరు కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యన్ . చంద్రబాబు నాయుడు కు చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి కార్డన్ సెర్చ్లు నిర్వహించాలని, అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి