Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 12:35 AM

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్
April 28, 2026 08:34 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ తెలిపారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా, కొన్ని పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ఈ పుకార్ల కారణంగా ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తుండగా, కొందరు దీనిని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. దీంతో సాధారణ ప్రజలకు ఇంధనం అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రం కర్నాటకలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభిస్తున్నాయని, దీని ద్వారా రాష్ట్రంలో అసలు కొరత లేదని స్పష్టమవుతోందన్నారు. ఇది కొందరు కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యన్ . చంద్రబాబు నాయుడు కు చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కార్డన్ సెర్చ్‌లు నిర్వహించాలని, అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News