శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి పరిధిలో మురికి కాలువల దుర్వాసనతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక నాయకులు స్వయంగా ముందుండి కాలువలను శుభ్రం చేయించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిండి మామిడి అప్ప, శ్రీ లక్ష్మీనారాయణ, నబి రసూల్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంజి, గంగప్ప, శ్రీనివాస్ సేవలు అందించారు.
శుభ్రమైన పరిసరాల కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి