Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు
06-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు ఆర్థిక సంఘాల కింద తెలంగాణకు రూ.14,110 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.14,110 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,060 కోట్లు కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,050 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రాష్ట్రానికి రూ.14,110 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం కింద రూ.5,060 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.6,051 కోట్లు కలిపి మొత్తం రూ.11,111 కోట్లను 2025 డిసెంబర్ 31 నాటికి విడుదల చేశారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మొత్తం రూ.1,034 కోట్ల 42 లక్షల నిధులను విడుదల చేసింది. గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటివరకు వినియోగించిన నిధుల వివరాలను సమర్పిస్తూ వినియోగ ధృవీకరణ పత్రాలను అందిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

Sthanikam

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

Article Image

రెండు ఆర్థిక సంఘాల కింద తెలంగాణకు రూ.14,110 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.14,110 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,060 కోట్లు కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,050 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రాష్ట్రానికి రూ.14,110 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం కింద రూ.5,060 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.6,051 కోట్లు కలిపి మొత్తం రూ.11,111 కోట్లను 2025 డిసెంబర్ 31 నాటికి విడుదల చేశారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మొత్తం రూ.1,034 కోట్ల 42 లక్షల నిధులను విడుదల చేసింది. గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటివరకు వినియోగించిన నిధుల వివరాలను సమర్పిస్తూ వినియోగ ధృవీకరణ పత్రాలను అందిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News