Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 05:53 AM

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు
March 06, 2026 08:50 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

రెండు ఆర్థిక సంఘాల కింద తెలంగాణకు రూ.14,110 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.14,110 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,060 కోట్లు కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,050 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రాష్ట్రానికి రూ.14,110 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం కింద రూ.5,060 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.6,051 కోట్లు కలిపి మొత్తం రూ.11,111 కోట్లను 2025 డిసెంబర్ 31 నాటికి విడుదల చేశారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మొత్తం రూ.1,034 కోట్ల 42 లక్షల నిధులను విడుదల చేసింది. గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటివరకు వినియోగించిన నిధుల వివరాలను సమర్పిస్తూ వినియోగ ధృవీకరణ పత్రాలను అందిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News