Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:16 PM

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు
January 27, 2026 06:48 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక వర్గాన్ని విస్మరించి, కార్పొరేట్లకు మరియు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఏ. బాలకృష్ణ, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు అశోక్ కుమార్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్యలు విమర్శించారు.

మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గాల వారీగా డివిజన్ సదస్సులు నిర్వహించాలని, ఫిబ్రవరి 6న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, సమస్యలపై పోరాడే హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల పేరుతో శాశ్వత ఉద్యోగాలకు ఎగనామం పెడుతున్నారని, కంపెనీల మూసివేతకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదన్న నిబంధనలు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయంగా మారాయని అన్నారు. మొత్తంగా ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఊరితాళ్లుగా మారాయని, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాల్లో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు అన్ని వర్గాల వారు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకులు బెల్లంకొండ గురవయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు సాయి కుమార్, ఐఎన్‌టీయూసీ నాయకులు మెల్లచెరువు ముక్కంటి, కరుణాకర్ రెడ్డి, చింతకాయల రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News