Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:54 AM

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు
January 27, 2026 06:48 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక వర్గాన్ని విస్మరించి, కార్పొరేట్లకు మరియు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఏ. బాలకృష్ణ, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు అశోక్ కుమార్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్యలు విమర్శించారు.

మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గాల వారీగా డివిజన్ సదస్సులు నిర్వహించాలని, ఫిబ్రవరి 6న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, సమస్యలపై పోరాడే హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల పేరుతో శాశ్వత ఉద్యోగాలకు ఎగనామం పెడుతున్నారని, కంపెనీల మూసివేతకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదన్న నిబంధనలు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయంగా మారాయని అన్నారు. మొత్తంగా ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఊరితాళ్లుగా మారాయని, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాల్లో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు అన్ని వర్గాల వారు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకులు బెల్లంకొండ గురవయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు సాయి కుమార్, ఐఎన్‌టీయూసీ నాయకులు మెల్లచెరువు ముక్కంటి, కరుణాకర్ రెడ్డి, చింతకాయల రాము తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News