Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: అదనపు ఎస్పీ చైతన్య డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 07:11 PM

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య
April 29, 2026 05:48 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

ఫ్యూచర్ సిటీ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా ఎక్కడనేది స్పష్టంగా చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు అన్న విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.

ప్రజా సమస్యల కంటే పరిపాలనా యంత్రాంగంపై దృష్టి పెట్టడం సరికాదని, ప్రజా ఉద్యమాలను బలహీనపరచే విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పించిన ఆయన, హామీల అమలులో విఫలమైందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలు, నిరుద్యోగ సమస్యలు, భూమి పంపిణీ వంటి అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.

జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం తరఫున ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం లవణం ఉపేందర్ టోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News