Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:13 AM

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య
29-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

ఫ్యూచర్ సిటీ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా ఎక్కడనేది స్పష్టంగా చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు అన్న విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.

ప్రజా సమస్యల కంటే పరిపాలనా యంత్రాంగంపై దృష్టి పెట్టడం సరికాదని, ప్రజా ఉద్యమాలను బలహీనపరచే విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పించిన ఆయన, హామీల అమలులో విఫలమైందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలు, నిరుద్యోగ సమస్యలు, భూమి పంపిణీ వంటి అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.

జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం తరఫున ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం లవణం ఉపేందర్ టోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

Article Image

నల్లగొండ,

ఫ్యూచర్ సిటీ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా ఎక్కడనేది స్పష్టంగా చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు అన్న విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.

ప్రజా సమస్యల కంటే పరిపాలనా యంత్రాంగంపై దృష్టి పెట్టడం సరికాదని, ప్రజా ఉద్యమాలను బలహీనపరచే విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పించిన ఆయన, హామీల అమలులో విఫలమైందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలు, నిరుద్యోగ సమస్యలు, భూమి పంపిణీ వంటి అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.

జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం తరఫున ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం లవణం ఉపేందర్ టోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News