Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:24 AM

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి
May 03, 2026 11:35 AM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News