ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి
ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.
ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి