Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 12:53 PM

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి
May 03, 2026 11:35 AM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News