పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు
పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు
Prakash
పెనుకొండ,: శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణ సమీపంలోని ఇస్లాపురం గ్రామంలో ఆర్డీటీ పాఠశాలలో దివంగత డా. ఫెర్రర్ 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీటీ ప్రతినిధులు, సభ్యులు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుకొండ తెలుగుదేశం పార్టీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్డీటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో డా. ఫెర్రర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆర్డీటీ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక రంగాల్లో ప్రజలకు సేవలు అందాయని తెలిపారు.
గత కొన్నేళ్లుగా సంస్థ రీన్యువల్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సంస్థకు రీన్యువల్ సాధించారని చెప్పారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు డా. ఫెర్రర్ సేవలను కొనియాడారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి