Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి – సీపీఎం నేత చుక్క రాములు పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 08:14 PM

పెనుకొండ 44వ జాతీయ రహదారిపై జింక మృతి

పెనుకొండ 44వ జాతీయ రహదారిపై జింక మృతి

పెనుకొండ 44వ జాతీయ రహదారిపై జింక మృతి
May 11, 2026 06:31 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. అడవిలో నుంచి రహదారి దాటేందుకు వచ్చిన జింకను వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావానికి జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.


స్థానికులు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జింక మృతదేహాన్ని పరిశీలించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది విచారణ చేపట్టినట్లు తెలిసింది.


జాతీయ రహదారిపై తరచూ వన్యప్రాణులు రోడ్డు దాటుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News