పెన్షన్ సమస్యల పరిష్కారానికి టిడిపి చొరవ
పెన్షన్ సమస్యల పరిష్కారానికి టిడిపి చొరవ
Editor Desk
ఆదోని,: ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చొరవ చూపారు. ఈ నెల 27న పత్రికలో వచ్చిన “పెన్షన్, టెన్షన్, పరేషాన్” వార్తకు స్పందించిన టిడిపి నాయకులు అధికారులను కదిలించి బాధితులకు న్యాయం చేశారు.
మాజీ ఎమ్మెల్యే, ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు మూడవ వార్డు దండిగేరి ప్రాంతానికి చెందిన వడ్డెమాన్ తాయమ్మకు పెన్షన్ అందజేశారు. అలాగే హనుమాన్ నగర్కు చెందిన పూర్తిగా వికలాంగురాలు మల్లమ్మ సమస్యను గుర్తించి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయించి కర్నూలుకు పంపించడంతో బోయ ఎల్లమ్మకు కూడా పెన్షన్ మంజూరైంది.
ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ పేదలు, నిరుపేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సమయానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి వెంటనే సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, రంగస్వామి నాయుడు, ఆలూరు ఎంపీడీవో మద్దిలేటి స్వామి, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి