Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం
09-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ మర్రిగూడ బాధితులకు శంకరా ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు

​ రోగులను పరామర్శించిన ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్

పేద ప్రజల జీవితాల్లో కంటి వెలుగులు నింపడమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన లక్ష్యమని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎంపికైన రోగులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శంకరా కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న బాధితులను ఆత్మీయంగా పలకరించారు.​వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.మునుగోడు నియోజకవర్గంలో ఎవరికీ కంటి చూపు సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. మర్రిగూడ మండలంలో ఇప్పటికే రెండవసారి ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. బాధితులకు ఉచిత రవాణా, భోజన వసతితో పాటు అత్యాధునిక వైద్య సేవలను ఫౌండేషన్ తరఫున అందిస్తున్నాం.​ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, మర్రిగూడ మండలానికి చెందిన రోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

Article Image

​ మర్రిగూడ బాధితులకు శంకరా ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు

​ రోగులను పరామర్శించిన ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్

పేద ప్రజల జీవితాల్లో కంటి వెలుగులు నింపడమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన లక్ష్యమని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎంపికైన రోగులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శంకరా కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న బాధితులను ఆత్మీయంగా పలకరించారు.​వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.మునుగోడు నియోజకవర్గంలో ఎవరికీ కంటి చూపు సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. మర్రిగూడ మండలంలో ఇప్పటికే రెండవసారి ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. బాధితులకు ఉచిత రవాణా, భోజన వసతితో పాటు అత్యాధునిక వైద్య సేవలను ఫౌండేషన్ తరఫున అందిస్తున్నాం.​ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, మర్రిగూడ మండలానికి చెందిన రోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News