Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 10:19 AM

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సొసైటీ కృషి చేయాలి: మంత్రి కోమటిరెడ్డి
April 30, 2026 08:13 AM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

రెడ్డి సామాజిక వర్గంలోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వేడుక కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్డిలు ముందంజలో ఉంటారని అన్నారు. రెడ్డి వర్గంలో కూడా పేదవారు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఉన్నత చదువులకు సొసైటీ నుంచి ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. టెక్నికల్ కోర్సుల్లో అధిక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సొసైటీ పదవులు చేపట్టిన వారు బాధ్యతగా పనిచేయాలని, పదవి చిన్నదా పెద్దదా అన్నది కాకుండా నిబద్ధతతో వ్యవహరించాలని అన్నారు.

నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, పేదలకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని మంత్రి తెలిపారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి వర్గంలో అందరూ సంపన్నులు కాదని, పేద విద్యార్థులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మంత్రులు కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మూల దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News