Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:26 PM

పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు

పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు

పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు
February 26, 2026 06:51 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎవరూ ఆందోళన చెందవద్దు – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా

జర్నలిస్టులకు పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే గుర్తింపు కార్డులు జారీ చేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్ జర్నలిస్టుల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన 252, 103 ఉత్తర్వులలో కేబుల్ చానెల్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల జారీ విషయంలో అన్యాయం జరిగిందని నాయకులు మంత్రికి తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, సిటీ కేబుల్ నిర్వహణాధికారి శివరామకృష్ణ, ఎం.ఎస్.ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ చానెల్ సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు కడకంచి వెంకటేష్, హెచ్.వి. చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News