Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపు ఘనంగా జరగనున్న ఊరడమ్మ, పాపమ్మ అమ్మవార్ల వార్షికోత్సవ బోనాలు 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 09:22 PM

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు
April 30, 2026 07:47 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు శ్రీనివాస్ రెడ్డి సేవలను స్మరించుకుని ప్రశంసించారు. ఆయన తన సేవాకాలంలో కర్తవ్యనిష్ఠతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయ‌న జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాదురు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి అంబటి హరి శివకుమార్, కోశాధికారి కల్లు రమేష్ రెడ్డి, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లోహిత్ రెడ్డి, ఎంపీడీవోలు గాదే జలంధర్ రెడ్డి, శర్మ, ఎండి యాకూబ్ నాయక్, మాజీ ఎంపీడీవో గంజి శివ, ఎంపీఓ రావుఫ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ నూల కమలాకర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News