పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు
పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు
Editor Desk
రామన్నపేట మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు శ్రీనివాస్ రెడ్డి సేవలను స్మరించుకుని ప్రశంసించారు. ఆయన తన సేవాకాలంలో కర్తవ్యనిష్ఠతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాదురు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి అంబటి హరి శివకుమార్, కోశాధికారి కల్లు రమేష్ రెడ్డి, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లోహిత్ రెడ్డి, ఎంపీడీవోలు గాదే జలంధర్ రెడ్డి, శర్మ, ఎండి యాకూబ్ నాయక్, మాజీ ఎంపీడీవో గంజి శివ, ఎంపీఓ రావుఫ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ నూల కమలాకర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి