ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్
ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్
Editor Desk
భువనగిరి,: జిల్లాలో ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు హాజరై ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి వినతిని ఆన్లైన్లో నమోదు చేసి, ఇకపై ఎన్ఐసీ పోర్టల్కు బదులుగా సీజీజీ ప్రజావాణి పోర్టల్ ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వినతిదారునికి యూనిక్ రిఫరెన్స్ నంబర్తో రసీదు అందజేస్తారని, దాని ద్వారా వినతి స్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చన్నారు.
అధికారులు వినతులను 30 రోజుల్లోగా పరిష్కరించి నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆలస్యమైతే కేసులు ఉన్నతాధికారులకు పంపబడతాయని హెచ్చరించారు. ప్రజలు సీజీజీ ప్రజావాణి పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రజలకు త్రాగునీరు, కూర్చునే సదుపాయం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి