Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:48 PM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు
14-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట పోలీస్ పరిధిలో నాలుగో వార్డు కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రోడ్డు భద్రతను కాపాడటం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ఈనెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే జంక్షన్‌లను గుర్తించి జీబ్రా క్రాసింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.

నాలుగో వార్డులో భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ఆమె పేర్కొన్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పన్నీరు లక్ష్మణ్, ములుగు నరసింహ, విజయ్, వార్డు ప్రజలు విజయ, మాధవి, అండాలు, పోలీస్ సిబ్బంది మాధవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు

Article Image

యాదగిరిగుట్ట పోలీస్ పరిధిలో నాలుగో వార్డు కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రోడ్డు భద్రతను కాపాడటం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ఈనెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే జంక్షన్‌లను గుర్తించి జీబ్రా క్రాసింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.

నాలుగో వార్డులో భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ఆమె పేర్కొన్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పన్నీరు లక్ష్మణ్, ములుగు నరసింహ, విజయ్, వార్డు ప్రజలు విజయ, మాధవి, అండాలు, పోలీస్ సిబ్బంది మాధవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News