ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు
Editor Desk
యాదగిరిగుట్ట పోలీస్ పరిధిలో నాలుగో వార్డు కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రోడ్డు భద్రతను కాపాడటం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
ఈనెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే జంక్షన్లను గుర్తించి జీబ్రా క్రాసింగ్లు, లేన్ మార్కింగ్లు, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.
నాలుగో వార్డులో భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ఆమె పేర్కొన్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పన్నీరు లక్ష్మణ్, ములుగు నరసింహ, విజయ్, వార్డు ప్రజలు విజయ, మాధవి, అండాలు, పోలీస్ సిబ్బంది మాధవి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి