Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ
10-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శనివారం రాజకీయ ప్రత్యర్థులు అనుకోకుండా ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని కారులో వెళ్తుండగా, ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాహనం వచ్చింది. ఒకరిని ఒకరు గుర్తించిన ఇద్దరూ తమ కార్లను ఆపి కిందకు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఈ సందర్భంగా మండుటెండల్లో రైతులు కల్లాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వడ్ల కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి దిగుబడి అధికంగా వచ్చిందని, అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాజకీయంగా ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు అనుకోకుండా కలుసుకుని స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Sthanikam

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శనివారం రాజకీయ ప్రత్యర్థులు అనుకోకుండా ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని కారులో వెళ్తుండగా, ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాహనం వచ్చింది. ఒకరిని ఒకరు గుర్తించిన ఇద్దరూ తమ కార్లను ఆపి కిందకు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఈ సందర్భంగా మండుటెండల్లో రైతులు కల్లాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వడ్ల కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి దిగుబడి అధికంగా వచ్చిందని, అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాజకీయంగా ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు అనుకోకుండా కలుసుకుని స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News