Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 10:27 AM

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
April 29, 2026 08:35 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

రాజకీయాలకు అతీతంగా నల్లగొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది.

నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ విలీన ప్రాంతాల్లో ఇళ్లకు అసెస్‌మెంట్ చేపడితే కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని సూచించారు. అలాగే స్మశానవాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

30వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి గాంధీనగర్‌లో రోడ్డుపైకి మెట్లు నిర్మిస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ, కమిషనర్ బి. శరత్ చంద్ర, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News