Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:14 AM

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
29-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

రాజకీయాలకు అతీతంగా నల్లగొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది.

నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ విలీన ప్రాంతాల్లో ఇళ్లకు అసెస్‌మెంట్ చేపడితే కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని సూచించారు. అలాగే స్మశానవాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

30వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి గాంధీనగర్‌లో రోడ్డుపైకి మెట్లు నిర్మిస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ, కమిషనర్ బి. శరత్ చంద్ర, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్లగొండ,

రాజకీయాలకు అతీతంగా నల్లగొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది.

నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ విలీన ప్రాంతాల్లో ఇళ్లకు అసెస్‌మెంట్ చేపడితే కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని సూచించారు. అలాగే స్మశానవాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

30వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి గాంధీనగర్‌లో రోడ్డుపైకి మెట్లు నిర్మిస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ, కమిషనర్ బి. శరత్ చంద్ర, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News