Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వీధి కుక్కల నియంత్రణపై కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ ఆదేశాలు అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 08:36 PM

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..
March 28, 2026 07:08 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతం శ్రీలంక మంత్రి సునీల్‌ సేన్వి..

నాగార్జునసాగర్‌ : ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని ఇందుకు బుద్ధుని బోధనలే శరణ్యమని శ్రీలంక రిలీజియస్‌, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్‌ సేన్వి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’ను సందర్శించారు.

21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టులోని విశేషాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ కట్టడాలు అత్యంత ప్రాచుర్యం పొందడం సంతోషకరమన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో విశిష్టమైనది. ఇక్కడి నిర్మాణాలు, శిల్పకళ అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ బుద్ధ శాంతి సమావేశం నాకు ఎంతో సంతృప్తిని సరికొత్త అనుభవాన్ని మిగిల్చింది అని కొనియాడారు. సమకాలీన ప్రపంచానికి శాంతి ఎంతో అవసరమని బుద్ధవనం వంటి ఆధునిక బౌద్ధ నమూనాలను శ్రీలంకలోనూ విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.మంత్రి పర్యటనలో భాగంగా 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు, విదేశీ ప్రతినిధులు బుద్ధవనంలోని స్తూపాలను దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రాజెక్టు రూపకర్త, మాజీ డీజీపీ శ్రీ ఆంజనేయ రెడ్డి, ప్రముఖ నటుడు గగన్ మాలిక్, వియత్నాం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిక్నాథ్ టు, నవ నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, స్థానిక శాసన సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News