Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:28 PM

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
April 13, 2026 08:54 AM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముంబై నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.1933లో మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ పట్టణంలో ఆశా భోస్లే జన్మించారు. బాల్యంనుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, వేలాది పాటలతో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కూడా ప్రసిద్ధి చెందారు.తన గాన ప్రస్థానంలో ఆశా భోస్లే ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు కైవసం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమెకు భారత సినీ రంగంలోని అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేశారు.అదేవిధంగా 2008లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ను అందుకుని గౌరవాన్ని చాటుకున్నారు.ఆశా భోస్లే మరణంతో భారతీయ సంగీతానికి తీరని లోటు ఏర్పడిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గాత్రం తరతరాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అభిమానులు పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News