Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 10:28 AM

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
April 13, 2026 08:54 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముంబై నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.1933లో మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ పట్టణంలో ఆశా భోస్లే జన్మించారు. బాల్యంనుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, వేలాది పాటలతో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కూడా ప్రసిద్ధి చెందారు.తన గాన ప్రస్థానంలో ఆశా భోస్లే ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు కైవసం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమెకు భారత సినీ రంగంలోని అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేశారు.అదేవిధంగా 2008లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ను అందుకుని గౌరవాన్ని చాటుకున్నారు.ఆశా భోస్లే మరణంతో భారతీయ సంగీతానికి తీరని లోటు ఏర్పడిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గాత్రం తరతరాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అభిమానులు పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News