Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:08 PM

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి
May 11, 2026 09:08 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ Anurag Jayanti అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు.

అందులో రెవెన్యూ శాఖకు 47, జిల్లా పంచాయతీ శాఖకు 8, పంచాయతీరాజ్ శాఖకు 3, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, విద్యాశాఖకు 2, ఉపాధి కల్పన శాఖకు 2, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సర్వే అండ్ ల్యాండ్స్, మైన్స్, ఫిషరీస్, వ్యవసాయ, జిల్లా సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.

అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదని, వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News