ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ Anurag Jayanti అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు.
అందులో రెవెన్యూ శాఖకు 47, జిల్లా పంచాయతీ శాఖకు 8, పంచాయతీరాజ్ శాఖకు 3, ఎస్సీ డెవలప్మెంట్కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, విద్యాశాఖకు 2, ఉపాధి కల్పన శాఖకు 2, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సర్వే అండ్ ల్యాండ్స్, మైన్స్, ఫిషరీస్, వ్యవసాయ, జిల్లా సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదని, వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి