Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:18 AM

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి
11-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ Anurag Jayanti అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు.

అందులో రెవెన్యూ శాఖకు 47, జిల్లా పంచాయతీ శాఖకు 8, పంచాయతీరాజ్ శాఖకు 3, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, విద్యాశాఖకు 2, ఉపాధి కల్పన శాఖకు 2, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సర్వే అండ్ ల్యాండ్స్, మైన్స్, ఫిషరీస్, వ్యవసాయ, జిల్లా సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.

అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదని, వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ Anurag Jayanti అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 75 అర్జీలను స్వీకరించారు.

అందులో రెవెన్యూ శాఖకు 47, జిల్లా పంచాయతీ శాఖకు 8, పంచాయతీరాజ్ శాఖకు 3, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, విద్యాశాఖకు 2, ఉపాధి కల్పన శాఖకు 2, మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సర్వే అండ్ ల్యాండ్స్, మైన్స్, ఫిషరీస్, వ్యవసాయ, జిల్లా సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు పేర్కొన్నారు.

అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదని, వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌వో జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News