PRINT TIME: May 11, 2026 08:06 PM
ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు
ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు
May 11, 2026 06:31 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో మంత్రి సవిత అదేశాలతో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టారు. గ్రామాల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సోమవారం ఎస్సీ కాలనీలోని పలు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో నబి, షబ్బీర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి