Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:24 PM

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
March 06, 2026 12:19 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ… ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇకపై రేషన్ కార్డు కోసం నిరంతరంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్తగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News