Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 06, 2026 06:58 PM

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
March 06, 2026 12:19 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ… ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇకపై రేషన్ కార్డు కోసం నిరంతరంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్తగా అర్హత పొందిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తులు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News