ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Harish K
ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు ముఖ్యంగా నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోదాడ మండల గ్రామ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, చిమ్మిరాల గ్రామపంచాయతీ సర్పంచ్ కొత్త గురువయ్య అన్నారు మంగళవారం గ్రామములోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మంగలతండా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొన్నారు వైద్య సిబ్బంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారని అలాగే ఆపరేషన్ అవసరం ఉన్న రోగులకు సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ లో ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ వైద్యులకు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బండ్ల సైదులు,గ్రామ కార్యదర్శి వీరబాబు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి