ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్
Editor Desk
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాలలో మౌలిక వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులను చేపట్టారు.
రూసా నిధులతో నిర్మించిన వెహికల్ షెడ్తో పాటు ప్రధాన రహదారి నుంచి కళాశాల భవనం వరకు నిర్మించిన సీసీ రోడ్డును కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక వసతుల పెంపు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు.
ఈ సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామన్నపేట పరిసర ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందుతూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.ఈ
కార్యక్రమంలో ఇన్చార్జ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ జె. నరేశ్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి