పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
K.RAVI
దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి