Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యం కావాలి దాసరి పాండు చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 06:25 PM

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
April 28, 2026 04:13 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News