Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:25 AM

పదో తరగతి ఫలితాల్లో ‘విశాల భారతి’ విజయకేతనం

పదో తరగతి ఫలితాల్లో ‘విశాల భారతి’ విజయకేతనం

పదో తరగతి ఫలితాల్లో ‘విశాల భారతి’ విజయకేతనం
April 29, 2026 07:08 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ప్రతిభ

ప్రతిభావంతులను అభినందించిన సీఐ మన్మథ కుమార్, కరస్పాండెంట్‌ చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో స్థానిక చౌటుప్పల్ పట్టణంలోని విశాల భారతి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కొలుకులపల్లి పుష్ప (554)​ బొమ్మగాని కార్తీక్ (543)​ తాళ్లూరి సాయి గంగా సుహాని (542) శివ కౌశిక్ (509), ఒంటెద్దు అక్షర (502) మార్కులతో విశిష్ట ప్రతిభ కనబరిచారు.​ ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కరస్పాండెంట్

పాఠశాల కరస్పాండెంట్ విసం చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కఠోర శ్రమ వల్లే వంద శాతం ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఆంటోనీ, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News