PRINT TIME: May 01, 2026 01:34 PM
పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు
పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు
May 01, 2026 11:40 AM
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.
ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి