PRINT TIME: April 30, 2026 09:35 PM
పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్కు మండల టాప్
పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్కు మండల టాప్
April 30, 2026 07:54 PM
13 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదగిరిగుట్ట, ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.
పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.
ఈ ఏడాది ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి