Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేవైసీ రద్దు చేయాలి… 200 రోజులు పని, రూ.800 కూలీ ఇవ్వాలని వినతి. డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 30, 2026 04:24 PM

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా
April 30, 2026 02:44 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్‌కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News