PRINT TIME: April 30, 2026 04:24 PM
పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా
పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా
April 30, 2026 02:44 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్,
విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి