Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం
29-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పదో తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని తమ పాఠశాల కీర్తిని పతాక స్థాయికి చేర్చారు. గ్రీన్ గ్రోవ్ ​పాఠశాలకు చెందిన బాలగోని అక్షర్ 585 అత్యుత్తమ మార్కులతో మండలంలోనే మొదటి స్థానంలో నిలవగా.. పందిరి సహస్ర 581 మార్కులతో ప్రతిభను చూపించి మండలంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ​ఈ ఘన విజయంపై పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల సరైన దిశానిర్దేశం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపి విద్యార్థులను ఘనంగా సన్మానించారు..

Sthanikam

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

Article Image

పదో తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని తమ పాఠశాల కీర్తిని పతాక స్థాయికి చేర్చారు. గ్రీన్ గ్రోవ్ ​పాఠశాలకు చెందిన బాలగోని అక్షర్ 585 అత్యుత్తమ మార్కులతో మండలంలోనే మొదటి స్థానంలో నిలవగా.. పందిరి సహస్ర 581 మార్కులతో ప్రతిభను చూపించి మండలంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ​ఈ ఘన విజయంపై పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల సరైన దిశానిర్దేశం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపి విద్యార్థులను ఘనంగా సన్మానించారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News