పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.
పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి