PRINT TIME: July 03, 2026 03:24 AM
పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం
పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం
April 29, 2026 08:15 PM
32 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్గొండ, ఏప్రిల్ 30 — స్థానికం న్యూస్:
నల్గొండ జిల్లా సందీప్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి శాతం ఫలితాలను నమోదు చేసింది. పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులవడం విశేషం.
విద్యార్థిని వై. మధు శ్రీ 600 మార్కులకు 576 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానం సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 25 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.
విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు, చైర్మన్ గానుతల సత్యనారాయణ రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి