పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్పీఆర్ హైస్కూల్
పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్పీఆర్ హైస్కూల్
Editor Desk
నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ హైస్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించింది. గత 21 సంవత్సరాలుగా ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతను కొనసాగిస్తున్న ఈ పాఠశాల, ఈ ఏడాది కూడా 100% ప్రథమ శ్రేణి ఫలితాలను సాధించడం విశేషం.
ఈసారి 20 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. వీరిలో బి. భాగ్యశ్రీ 589 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, బి. సృష్టి 587, ఎం. అశ్విత 580, అవినాష్ 576, సిహెచ్. సాయి 572, కె. రితిక 571, కె. వర్ష 565, ఏ. ఉత్తమ్ కుమార్ 565, సిహెచ్. లక్ష్మీప్రసన్న 563, కె. కార్తికేయ 564, పి. శ్రీకాంత్ 562, శ్రీనిజ 562, పి. క్షేత్రనారాయణ 560, లక్ష్మీప్రసన్న 560, చిత్రిత్యాచారి 559, హిత్రిక 559, వై. సర్వజ్ఞ 559, కె. మహేష్ 555, ఓంకార్ 554, అక్షయ్ రామ్ 554, అజయ్ కుమార్ 553, శర్వాన్ 552, శివశంకర్ రెడ్డి 552, దీపక్ 550, సృజన్ పాల్ 551 మార్కులు సాధించారు.
మొత్తం 189 మంది విద్యార్థుల్లో 103 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం. నాణ్యమైన బోధన, సిసిఈ విధానం, అసైన్మెంట్ సిస్టమ్, రోజువారీ వర్క్షీట్లు, ఆధునిక బోధన పద్ధతులు ఈ విజయానికి కారణమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ్ రెడ్డి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల చైర్మన్ డా. బి. ఇమావంత రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ వరప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎం. ధోని మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి