Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:21 AM

పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్‌పీఆర్ హైస్కూల్

పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్‌పీఆర్ హైస్కూల్

పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్‌పీఆర్ హైస్కూల్
April 29, 2026 08:44 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎస్‌పీఆర్ హైస్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించింది. గత 21 సంవత్సరాలుగా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతను కొనసాగిస్తున్న ఈ పాఠశాల, ఈ ఏడాది కూడా 100% ప్రథమ శ్రేణి ఫలితాలను సాధించడం విశేషం.

ఈసారి 20 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. వీరిలో బి. భాగ్యశ్రీ 589 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, బి. సృష్టి 587, ఎం. అశ్విత 580, అవినాష్ 576, సిహెచ్. సాయి 572, కె. రితిక 571, కె. వర్ష 565, ఏ. ఉత్తమ్ కుమార్ 565, సిహెచ్. లక్ష్మీప్రసన్న 563, కె. కార్తికేయ 564, పి. శ్రీకాంత్ 562, శ్రీనిజ 562, పి. క్షేత్రనారాయణ 560, లక్ష్మీప్రసన్న 560, చిత్రిత్యాచారి 559, హిత్రిక 559, వై. సర్వజ్ఞ 559, కె. మహేష్ 555, ఓంకార్ 554, అక్షయ్ రామ్ 554, అజయ్ కుమార్ 553, శర్వాన్ 552, శివశంకర్ రెడ్డి 552, దీపక్ 550, సృజన్ పాల్ 551 మార్కులు సాధించారు.

మొత్తం 189 మంది విద్యార్థుల్లో 103 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం. నాణ్యమైన బోధన, సిసిఈ విధానం, అసైన్‌మెంట్ సిస్టమ్, రోజువారీ వర్క్‌షీట్లు, ఆధునిక బోధన పద్ధతులు ఈ విజయానికి కారణమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ్ రెడ్డి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల చైర్మన్ డా. బి. ఇమావంత రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ వరప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎం. ధోని మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News