పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్
పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్
Editor Desk
నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది. అపజయం ఎరుగని ఫలితాలు మాకే సొంతమని మరోసారి రుజువు చేస్తూ ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించింది.
తెలంగాణ ఎస్ఎస్సీ–2026 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 51 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం విశేషం.
ఈ సందర్భంగా ఎస్. వర్షిత 572 మార్కులతో టాప్ సాధించగా, పి. ప్రశాంత్ రెడ్డి 568, ఎం. కార్తీక్ కుమార్ 568, ఐ. మణిదీప్ 567, రాఘవేందర్ రెడ్డి 556, సిహెచ్. వర్షిని 552, యశ్వంత్ రెడ్డి 552, వర్షిత 552, నికిత 551 మార్కులు సాధించారు.
విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయి. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ విజయానికి కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. “చదువును ఆసక్తిగా నేర్పిస్తూ, సంస్కారాన్ని బలపరచడం మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి