Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలల భద్రతకు సమాజం ముందుకు రావాలి: భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మీ బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 07:58 PM

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.
May 01, 2026 06:22 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో నోచ్ ల్యాబ్ అనుమతులు రద్దు చేయాలి – మేడే రోజు కంపెనీ నిర్వహణపై తీవ్ర ఆగ్రహంమేడే (కార్మిక దినోత్సవం) రోజున కూడా నిబంధనలను విస్మరించి కంపెనీ నిర్వహించడం ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కినట్లేనని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ యాజమాన్యం కార్మికుల హక్కులను పూర్తిగా పట్టించుకోకుండా, మేడే రోజున పని చేయించడం ద్వారా రియాక్టర్ పేలి కార్మికులు తీవ్రoగా గాయపడినరని,వారికీ మెరుగైన వైద్యం అదించి ప్రాణాలను కాపడాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నోచ్ ల్యాబ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొని:నోచ్ ల్యాబ్‌కు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలిసంబంధిత జిల్లా పరిశ్రమల అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలికార్మిక హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ను కోరారు.మొదటి సారి ప్రమాదం జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం జరిగిఉండక పోవచ్చు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ వలన ప్రజలకు, కార్మికులకు భద్రత లేదని ఈ కంపెనీ ని ముసివేయాలని డిమాoడ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News